సేవాదళ్ నకిరేకల్ ఇనచార్జ్ రమే్షకు సన్మానం
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:03 AM
పట్టణ కేంద్రానికి చెందిన మోటె రమేష్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నకిరేకల్ నియోజకవర్గవర్గ ఇనచార్జ్ ఎంపిక కావడం పట్ల శుక్రవారం ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వంగా కలిశారు.
రామన్నపేట, ఏప్రిల్ 27: పట్టణ కేంద్రానికి చెందిన మోటె రమేష్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నకిరేకల్ నియోజకవర్గవర్గ ఇనచార్జ్ ఎంపిక కావడం పట్ల శుక్రవారం ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, నాయకులు, గంగుల రాజిరెడ్డి, జినుకల ప్రభాకర్ , పూస బాలకిషన, గోదాసు పృఽథ్విరాజ్, రేహాన, జెల్ల వెంకటేషం, ప్రవీణ్ పాల్గొన్నారు.