Share News

ఊరంతా ఆధ్యాత్మిక సంబురాలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:18 AM

మండలంలోని కూరెళ్ల గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సోమేశ్వరస్వామి, సీతారాములు దేవతల విగ్రహాలు, నవగ్రహాల ప్రతిష్టాపనోత్సవాల సందర్భంగా ఊరంతా సంబురాలు జరుపుకుంటున్నారు.

 ఊరంతా ఆధ్యాత్మిక సంబురాలు
ధ్వజస్తంభాన్ని ప్రతిష్టిస్తున్న భక్తులు

ఆత్మకూరు(ఎం), ఏప్రిల్‌ 24: మండలంలోని కూరెళ్ల గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సోమేశ్వరస్వామి, సీతారాములు దేవతల విగ్రహాలు, నవగ్రహాల ప్రతిష్టాపనోత్సవాల సందర్భంగా ఊరంతా సంబురాలు జరుపుకుంటున్నారు. మూడో రోజు బుధవారం గణపతిపూజ, గర్తపూజలు, బీజన్యాసం, రత్నన్యాసం, ధాతున్యాసం పూజలు నిర్వహించారు. రామాలయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, అంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్ట, యంత్రస్థాపనం, ధ్వజస్తంభం ప్రతిష్టించారు. అనంతరం సోమేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట, నవగ్రహాల యంత్రస్థాపనం చేశారు. డీసీసీబి మాజీ చైర్మన మోతె సోమిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గుండా బాలాజీ, మోతె పిచ్చిరెడ్డి, మోతె యాదిరెడ్డి, బాషబోయిన ఉప్పలయ్య, బాషబోయిన పాపయ్య, ఎరులస్వామి, కూరెళ్ల రమేష్‌, ఉప్పల నర్సింహ్మ, శ్రీహరి రాములు, బిక్షం, వెంకటేశం,సత్యనారాయణ, సంతోష్‌, శ్రీను, వేద పండితులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:18 AM