Share News

50 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:59 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పట్టణ కోత్వాల్‌గూడ చెన్నమ్మ హోటల్‌ వద్ద ఔటర్‌ రింగురోడ్డు-సర్వీసు రోడ్డు పరిధిలో శనివారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేశారు.

50 కిలోల గంజాయి పట్టివేత

శంషాబాద్‌, ఏప్రిల్‌ 27 : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పట్టణ కోత్వాల్‌గూడ చెన్నమ్మ హోటల్‌ వద్ద ఔటర్‌ రింగురోడ్డు-సర్వీసు రోడ్డు పరిధిలో శనివారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేశారు. ఓ కారును ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి బ్యాగులు లభించాయి. పట్టుబడిన గంజాయిని తూకం వేయగా 50కిలోలుగా తేలింది. గంజారుని స్వాధీనం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తును ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గంజాయిని ఎక్కడి నుంచి తరలిస్తున్నారు? అనే వివరాల కోసం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:59 PM