కారు ఢీకొని వ్యక్తి మృతి
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:52 AM
మండల పరిధిలోని లాల్పహాడ్ వద్ద ఓ కారు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు జిల్లేడ్ చౌదరిగూడ ఎస్సై సక్రం తెలిపారు.
చౌదరిగూడ, ఏప్రిల్ 24 : మండల పరిధిలోని లాల్పహాడ్ వద్ద ఓ కారు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు జిల్లేడ్ చౌదరిగూడ ఎస్సై సక్రం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలోని వనంపల్లి గ్రామానికి చెందిన వనం వెంకటయ్య(64) బుధవారం సాయంత్రం లాల్పహాడ్ వద్ద రోడ్డు దాటుతుండగా పరిగి నుంచి షాద్నగర్ వైపు వెళుతున్న ఓ కారు అతి వేగంతో వచ్చి ఢీకొంది. దీంతో అక్కడిక్కడే రోడ్డుపై పడి వెంకటయ్య మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుమారుడు జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.