కండక్టర్ క్యాష్ బ్యాగ్ నుంచి రూ.10వేలు అపహరణ
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:39 AM
మేడ్చల్ ఆర్టీసీ డిపోకు చెందిన ఓ కండక్టర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో అతడి వద్ద ఉన్న క్యాష్బ్యాగ్ నుంచి గుర్తుతెలియిన దండగుడు రూ.10వేలు దొంగిలించాడు.
మేడ్చల్ టౌన్, ఏప్రిల్ 24 : మేడ్చల్ ఆర్టీసీ డిపోకు చెందిన ఓ కండక్టర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో అతడి వద్ద ఉన్న క్యాష్బ్యాగ్ నుంచి గుర్తుతెలియిన దండగుడు రూ.10వేలు దొంగిలించాడు. మంగళవారం రాత్రి మేడ్చల్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు రామాయంపేట నుంచి సికింద్రాబాద్కు బయలుదేరి మేడ్చల్ ఆర్టీసీ డిపోకు చేరుకుంది. అప్పటికే టిక్కెట్ల ద్వారా ప్రయాణికుల నుంచి స్వీకరించిన డబ్బు రూ.10వేలు కండక్టర్ సాయికుమార్ లెక్కించి తన క్యాష్బ్యాగులో భద్రపరుచుకున్నాడు. మేడ్చల్ డిపో వద్దకు చేరుకున్న అనంతరం క్యాష్ బ్యాగ్లో డబ్బులు కనబడలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.