బీజేపీని గద్దెదించాలి
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:04 AM
కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ పంచాయతీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నర్సింహారెడ్డి, బీకే ఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య అన్నారు.
చౌదరిగూడ, ఏప్రిల్ 27: కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ పంచాయతీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నర్సింహారెడ్డి, బీకే ఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య అన్నారు. శనివారం జిల్లేడ్ చౌదరిగూడ మండల కేంద్రంలో మేడేను పురస్కరించుకొని వాల్పోస్టర్ను విడుదల చేశారు. వారు మాట్లాడుతూ 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను సమూలంగా రద్దుచేసి, పెట్టుబడిదారులకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం చట్టాలు చేసి కార్మికుల నడ్డి విరిచిందని ఆరోపించారు. కార్మిక సంఘాల నాయకులు లింగమయ్య, బాల్రాజ్, వీరేష్, రమేష్, షబ్బీర్, కార్మికులు పాల్గొన్నారు.