ఓటుహక్కును వినియోగించుకోవాలి
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:05 AM
ఓటువేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీఎం శోభారాణి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని స్ర్తీ శక్తిభవన్లో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలకు ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మహిళలకు అవగాహన కల్పిస్తున్న అఽధికారులు
చేవెళ్ల, ఏప్రిల్ 27 : ఓటువేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీఎం శోభారాణి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని స్ర్తీ శక్తిభవన్లో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలకు ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటువేయడం బాధ్యతగా భావించాలన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటువేయాలన్నారు. ఎస్బీహెచ్ మేనేజర్ సంధ్య, సీసీలు సాగర్, మాణెయ్య, శ్రీనివాస్, షబ్బీర్, ప్రభాకర్, నర్సింలు, యాదయ్య, వైదేహి, సిబ్బంది సబితా, అరుణ, బాల్రాజ్, పాల్గొన్నారు.