రూ.20,500 విలువైన మద్యం పట్టివేత
ABN , Publish Date - Apr 27 , 2024 | 11:59 PM
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు వేర్వేరు చోట్ల తనికీలు, దాడుల్లో రూ.20,500 విలువైన మద్యాన్ని పట్టుకున్నారు.
యాచారం, ఏప్రిల్ 27 : హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు వేర్వేరు చోట్ల తనికీలు, దాడుల్లో రూ.20,500 విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై మాల్ వద్ద యాచారం పోలీసు లు శనివారం వాహనాల తనిఖీ చేస్తుండగా మదనాపురానికి చెందిన శివ(25) కారులో రూ.9,500 విలువైన మద్యం పట్టుబడింది. అలాగే గున్గల్ గేటు వద్ద వాహనాలు తనిఖీల్లో జాపాలకు చెందిన రాజు(24) పాల ఆటోలో రూ.7000 వేల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. అలాగే గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు తాటిపర్తిలో వెంకటమ్మ అనే మహిళ ఇంటిపై దాడిచేసి రూ.4వేల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ శంకర్కుమార్ తెలిపారు. దాడుల్లో ఎస్సైలు గోపాల్, కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు.