వంశీచంద్రెడ్డి గెలుపునకు కృషి చేయాలి
ABN , Publish Date - Apr 24 , 2024 | 12:00 AM
లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి గెలుపునకు కృషి చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ హన్మంతరావు అన్నారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు
చౌదరిగూడ, ఏప్రిల్ 23: లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి గెలుపునకు కృషి చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ హన్మంతరావు అన్నారు. మంగళవారం షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి జిల్లేడ్-చౌదరిగూడ మండల పరిధిలోని ఎల్కాగూడ, చౌదరిగూడలో వంశీచంద్రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, నేడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని విమర్శిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో నాలుగింటిని అమలు చేసిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మేరోజులు పోయాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేసి చల్లా వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. అనంతరం జిల్లేడ్ గ్రామ శివారులోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. మండలాధ్యక్షుడు చలివేంద్రంపల్లి రాజు, నాయకులు వెంకటనర్సింహారెడ్డి, రవికుమార్, కొయ్యల నర్సింలు, జితేందర్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, ఎజాజ్, అన్వర్, వేణుగోపాల్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.