కేసీఆర్కు ఘన స్వాగతం
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:27 AM
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు షాద్నగర్ బైపాస్ రోడ్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో షాద్నగర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.
మహబూబ్నగర్లో రోడ్షోకు వెళుతుండగా షాద్నగర్ బైపా్స రోడ్లో స్వాగతం
మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో రోడ్షోకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
గులాబీమయంగా షాద్నగర్ బైపాస్ రోడ్డు 8 కార్యకర్తలకు అభివాదం చేసిన కేసీఆర్
షాద్నగర్, ఏప్రిల్ 26: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు షాద్నగర్ బైపాస్ రోడ్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో షాద్నగర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కేసీఆర్ వాహనానికి గుమ్మడికాయలతో దిష్టితీసి.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. పల్లెలన్నీ కారు, సారును కోరుకుంటున్నాయని, మరోమారు మన సత్తా చాటే సమయం వచ్చిందని నాయకులు ముక్తకంఠంతో నినాదాలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే రోడ్షోకు వెళ్తున్న క్రమంలో కేసీఆర్కు నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. ఆయనకు స్వాగతం పలికేందుకు గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో శ్రేణులు తరలిరావడంతో షాద్నగర్ బైపాస్ రోడ్ గులాబీమయంగా మారింది. అనంతరం వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు మహబూబ్నగర్లో నిర్వహించే కేసీఆర్ రోడ్షోకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ మన సార్.. కేసీఆర్కు స్వాగతం పలికేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలని కోరారు. లోక్సభ ఎన్నికల్లో మన సత్తాను చాటాలని, కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.