Home » Education
ఉమ్మడి వరంగల్ ముద్దుబిడ్డ మెరుగు కౌషిక్ సివిల్స్ లో సత్తా చాటాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా 82వ ర్యాంక్ సాధించాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ కొట్టాడు.
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఎగ్జామ్స్ ( Education ) రాసేసిన స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెలాఖరుకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం నాడు విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్ సైట్లో చూడొచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది మే 28వ తేదీన జరిగింది. అందులో మెయిన్స్కు క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో లా కాలేజీల్లో న్యాయ విద్య కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష గడువును పొడగించారు. తొలుత ప్రకటించిన గడువు ఏప్రిల్ 15వ తేదీతో ముగిసింది. అభ్యర్థుల వినతి మేరకు మరో 10 రోజులు అవకాశం ఇచ్చారు.
డిగ్రీ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 12వ బ్యాచ్ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు బ్యాంకు రూ.70 వేల వరకు అందిస్తుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. భారతీయ రైల్వేలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలై, దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అర్హతలు ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET 2024) జూలై 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా ముఖ్యమైన తేదీలు, అర్హత సహా పలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నెలలో వరసగా మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవు వచ్చాయి. 8వ తేదీన శివరాత్రి సందర్భంగా పాఠశాలలు మూసి ఉంటాయి. 9వతేదీన రెండో శనివారం వచ్చింది. 10వ తేదీన ఆదివారం సెలవు ఉంటుంది. 11వ తేదీన సోమవారం తిరిగి స్కూళ్లను తెరుస్తారు.
టీఎస్ లాసెట్-2024, తెలంగాణ పీజీ లాసెట్ నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి శుక్రవారం నాడు విడుదల చేసింది. మూడు, ఐదేళ్ల లా కోర్సు కోసం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. హైదరాబాద్లో గల ఉస్మానియా యూనివర్సిటీ లాసెట్ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. లాసెట్కు రూ.900 ఫీజు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. పీజీఎల్ సెట్ 2024కు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ లాసెట్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 3వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.