Home » AAP
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్జప్తి చేశారు. గురువారం లఖ్నవూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేజ్రీవాల్తోపాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్ పాల్గొన్నారు.
మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ రావడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కేజ్రీ రంగంలోకి దిగితే రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో సోమవారంనాడు తనపై దాడి జరిపినట్టు అదే పార్టీకి చెప్పిన రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ స్వాతి మలివాల్ (Swamti Maliwal) చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎట్టకేలకు స్పందించింది. సీఎం వ్యక్తిగత సహాయకుడు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు అంగీకరించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి ఘటనలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ అంశంలో ఆయన స్పందించకపోవడం సిగ్గు చేటు అని పేర్కొంది.
కేజ్రీవాల్ని(CM Arvind Kejriwal) ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్ని సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ వేళ ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బంది తనపై దాడి చేసినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ ఆదివారంనాడు ఆరోపించారు.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. 10 గ్యారంటీలు అమలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ, పంజాబ్లో తమ ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మీద విడుదలయిన సంగతి తెలిసింది. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ను కలిశారు.
ప్రధాని మోదీపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తనను చూసి నేర్చుకోవాలని సూచించారు. తన క్యాబినెట్ మంత్రిపై ఆరోపణలు వస్తే జైల్లో వేశానని గుర్తుచేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నని చెబుతూనే దొంగలను పార్టీలో చేర్చుకుంటున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కి సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తనపై హనుమంతుడి ఆశీర్వాదం ఉందని.. జైలు నుంచి బయటకి వచ్చాక కేజ్రీ వ్యాఖ్యానించారు.