Home » AP News
Andhrapradesh: ‘‘నాలుగు దశాబ్దాలుగా ఎన్నికలు జరిగితే.. మా అన్న ఆనం వివేకానంద రెడ్డి లేకుండా నేను పోటీచేసిన ఎన్నికలు ఇవి’’ అని ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం తన ఇంటి వద్ద సమావేశ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆనం పాల్గొని ప్రసంగించారు. అధికారులు ఈ ఎన్నికల్లో తమకు సహకరించలేదని.. అధికారపార్టీకి కొమ్ముకాశారని ఆరోపించారు.
ఏపీకి నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతీకార దాడులకు అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. జూన్ 19 వరకూ పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ మేరకు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.
Andhrapradesh: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఇటు హైదరాబాద్, అటు బెజవాడలో ఉన్నట్టుండి వర్షం కురిసింది. భాగ్యనగరంలో గంట పాటు వర్షం పడగా.. అటు విజయవాడలో మాత్రం వర్ష బీభత్సం కొనసాగుతోంది. బెజవాడలో గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.
ప్రజలిచ్చిన విరాళాలతో పోటీచేసి గెలిచిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ఏలిన నియోజకవర్గమది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు డబ్బే ప్రధానమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నగదు వెదజల్లాయి. ఒక ఓటు సుమారు రూ.3 వేల వరకూ పలికిందంటే ఈ నియోజకవర్గం ఎంత ఖరీదైందో తెలుస్తుంది.
జోగి రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించిప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ, కంకిపాడు, పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడన నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
ఓ వైద్యురాలి అప్రమత్తత ఆరేళ్ల బాలుడి ఆయువు నిలిపింది. రహదారి మీదనే సీపీఆర్ చేయడంతో బాలుడి ప్రాణం నిలిచింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వైద్యురాలు రవళికి ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. విజయవాడలోని అయ్యప్ప నగర్లో ఆరేళ్ల బాలుడు సాయి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల రణరంగం అంతా ఇంతా కాదు. టీడీపీ నేతలపై దాడులు, నిర్బంధం ఇలా అనేక రకాలుగా దుశ్చర్యలకు పాల్పడ్డారు వైసీపీ నేతలు. అధికారపార్టీ విధ్వంసంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ వైసీపీ నేతలను పోలీసుల అరెస్ట్ చేయకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Andhrapradesh: ఎంపీ రఘురామ కృష్ణంరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తిరుమలకు చేరుకున్న ఎంపీ.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ రఘురామకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయంపై ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల(Andhra Pradesh Elections) నేపథ్యంలో జగన్(YS Jagan) సర్కార్ విపరీత పోకడల కారణంగా మొత్తం పోలీసు శాఖపైనే మచ్చ పడింది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం పోలీసు యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. దీని ఫలితంగా..
పల్నాడు జిల్లాలో బొల్లాపల్లి ఎస్ఐపై వైసీపీ నేతలు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల13న బొల్లాపల్లి ఎస్ఐ చెన్నకేశవులుపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెలుగు యువత నాయకుడు పోక వెంకట్రావు కారుపై దాడి చేసి బొల్లాపల్లి వైసీపీ నాయకులు హత్యాయత్నం చేశారు.