Home » BJP
Telangana: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నా ఫలితాలు రావడం లేదన్నారు. గన్నీ బ్యాగుల విషయంలో కావాలని కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వర్షాలతో కల్లాల్లో ధాన్యం కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
Andhrapradesh: ఎంపీ రఘురామ కృష్ణంరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తిరుమలకు చేరుకున్న ఎంపీ.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ రఘురామకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయంపై ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Telangana: రాములమ్మ అంటే తెలియని వారు ఉండరు. బీజేపీలో అసంతృప్తితో ఉన్న విజయశాంతి గతేడాదే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్లో రాములమ్మకు కీలక పదవి కూడా లభించింది. పార్టీలో చేరిన 24 గంటల్లోనే క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీకి చీఫ్ కో-ఆర్డినేటర్ పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్లో ఉంటూనే బీఆర్ఎస్ పార్టీ గురించి విజయశాంతి మాట్లాడటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీతో కూడిన విపక్ష ఇండియా కూటమి గెలిస్తే అయోధ్యలో రామమందిరాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని ప్రధాని మోదీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని నరేంద్ర మోదీ అధిష్టాస్తారని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో 400 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
విశాఖ: వైసీపీ గూండాలకు రోజులు దగ్గర పడ్డాయని, కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిపై దాడులు చేస్తారా? ఫ్యామిలీ ఇష్యూ అంటూ పోలీసులు కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజక వర్గం కూటమి అభ్యర్ధి విష్టుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: వైసీపీని ప్రజలు తారు డబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతమైన ఏపీని రావణకాష్టంగా మార్చారన్నారు. వైసీపీని నమ్ముకుని చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు తమ కేరీర్లో మచ్చ తెచ్చుకున్నారని... అందుకే పాత ఎఫ్.ఐ.ఆర్ను కూడా మార్చమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు.
‘నమస్తే.. బాస్. మీ ఏరియాలో రెండు ఓట్లూ మన పార్టీకే పడ్డాయా, లేక ఒక ఓటు అటు, ఇంకో ఓటు ఇటు పడి ఉండవచ్చా?’ అంటూ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై ఆయా రాజకీయ పార్టీల విశ్లేషణ కొనసాగుతున్నది.
ప్రజలిచ్చిన విరాళాలతో పోటీచేసి గెలిచిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ఏలిన నియోజకవర్గమది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు డబ్బే ప్రధానమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నగదు వెదజల్లాయి. ఒక ఓటు సుమారు రూ.3 వేల వరకూ పలికిందంటే ఈ నియోజకవర్గం ఎంత ఖరీదైందో తెలుస్తుంది.
తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసేస్తామన్న విపక్ష ‘ఇండీ’ కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ చట్టాన్ని ఎవరూ తీసివేయలేరని, ఏం చేస్తారో చేసుకోండని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. గురువారం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో పలు చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.