Home » BRS
వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులను ప్రోత్సహించటానికి, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేందుకుగాను ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రతిపాదనలు తెప్పించుకొని, తక్షణమే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయ పురోభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ చేసిన కృషిని వివరిస్తూ.. ఆపార్టీ నేత గోసుల శ్రీనివా్సయాదవ్ భూమిపుత్రుడు పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఎర్రవెల్లిలోని ఫామ్హౌ్సలో కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) విషయంలో యుటిలిటీ చార్జీలను చెల్లించబోమని గత బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి లేఖ రాయడంతో మొత్తం ప్రాజెక్టే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యుటిలిటీ చార్జీల కింద రూ.363.43 కోట్లను చెల్లిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి, తాను కలిసి లేఖ రాశామని వెల్లడించారు.
మాజీ మంత్రి హరీశ్రావుకు హైకోర్టులో నిరాశ ఎదురయింది. ఆనంద్ సినీ సర్వీసె్సకు జూబ్లీహిల్స్లో అయిదెకరాల భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఆయన 2008లో దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఆనంద్ సినీ సర్వీసె్సకు గోల్కొండ తాలూకా షేక్పేట్ గ్రామం సర్వే నెంబర్ 403లో ఎకరం రూ.8,500 చొప్పున అయిదెకరాల భూమిని కేటాయిస్తూ 2001లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 355 జారీచేసింది.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా అందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని తప్పనిసరిగా గెలిపించాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రె్సను గెలిపిస్తే.. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించే ప్రమాదం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వానాకాలం లోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలనే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ) మధ్యంతర నివేదికపై శనివారం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల వనరులసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎ్సఏ నిపుణుల కమిటీ మూడు బ్యారేజీలకు వర్షాకాలం ప్రారంభానికి ముందు అత్యవసరంగా చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనాలను సిఫారసు చేస్తూ గతంలో నివేదిక అందించింది.
తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ను బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) శుక్రవారం కలిశారు. లోక్సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ఓటర్కు ఆయన రూ. 500లు పంపిణీ చేశారని ఆరోపించారు.
Telangana: రాములమ్మ అంటే తెలియని వారు ఉండరు. బీజేపీలో అసంతృప్తితో ఉన్న విజయశాంతి గతేడాదే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్లో రాములమ్మకు కీలక పదవి కూడా లభించింది. పార్టీలో చేరిన 24 గంటల్లోనే క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీకి చీఫ్ కో-ఆర్డినేటర్ పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్లో ఉంటూనే బీఆర్ఎస్ పార్టీ గురించి విజయశాంతి మాట్లాడటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Telangana: పట్టభద్రుల ఎన్నిక అనేది చాలా ముఖ్యమని వరంగల్ - ఖమ్మం - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుముల రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారన్నారు. రెండు సార్లు కేసీఆర్కు అవకాశం ఇచ్చిన ప్రజలు... మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు.
‘నమస్తే.. బాస్. మీ ఏరియాలో రెండు ఓట్లూ మన పార్టీకే పడ్డాయా, లేక ఒక ఓటు అటు, ఇంకో ఓటు ఇటు పడి ఉండవచ్చా?’ అంటూ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై ఆయా రాజకీయ పార్టీల విశ్లేషణ కొనసాగుతున్నది.