Home » Chennai News
ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన వరుస విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఆ యా విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఐసీఐసీఐ(ICICI) ఫైనాన్షియల్ గ్రూప్కు పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ నారాయణన్ వాఘుల్(Narayanan Vaghul) ఈరోజు(మే 18న) కన్నుముశారు. 88 ఏళ్ల వయస్సులో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గత రెండు రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు.
తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణం(Kulasekhara town)లో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకానున్న చోట 1,500 ఎకరాల్లో ‘స్పేస్ పార్క్’ నిర్మాణం కానుంది. ఇందుకోసం ఇస్రోతో తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలోని ‘టిడ్కో’ ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్రంలో దశాబ్దాలుటా డీఎంకేకు వంతపాడుతుంటే కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చెందగలదని, తెలంగాణా మాజీ గవర్నర్, సౌత్ చెన్నై లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(Dr. Tamilisai Soundararajan) ప్రశ్నించారు.
పదేళ్లపాటు అల్లారు ముద్దుగా పెంచిన శునకం మృతిచెందడంతో దిగులు చెందిన దాని యజమాని ఘనంగా అంత్యక్రియలు జరిపి ఇంటి వద్దే ఖననం చేసి తనకున్న జంతుప్రేమను చాటుకున్నారు. కదిర్ గ్రామం(Kadir village) ప్రాంతానికి చెందిన మది 2014లో డాబర్మేన్ రకానికి చెందిన శునకాన్ని కొనుగోలు చేసి, దానికి రెంబో అని పేరు పెట్టి పెంచాడు.
కేరళలోకి ఈ నెల 31న నైరుతి రుతుపవనాలు ప్రవేశించనుండటం, బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం నెలకొనటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. అంతే కాకుండా స్థానిక వాతావరణ కేంద్ర అధికారులు ఈ నెల 20న మూడు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయంటూ ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్(Red alert)ను, 21వ తేదీ వరకు నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను, తక్కిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
రాష్ట్రంలో అగ్ని నక్షత్రం ఎండ వేడి అధికం కాకుండా పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురవటంతో వాతావరణం తరచూ చల్లబడుతోంది. ఈ నేపథ్యంలో తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి(Chennai Central to Tirupati) వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ రైళ్లు బుధవారం నుంచి ఈ నెల 31వ తేది వరకు తిరుపతికి బదులుగా రేణిగుంట వరకు మాత్రమే వెళతాయని దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
గడిచిన నాలుగేళ్లలోనే రాష్ట్రంలో 36,137 మంది బాలికలు గర్భం దాల్చినట్లు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానం అందింది. రాణిపేట జిల్లా మనపాక్కం ప్రాంతానికి చెందిన న్యాయవాది, పిల్లల హక్కుల కార్యకర్త సి.ప్రబాకరన్(C. Prabakaran), రాష్ట్రంలో 2021 నుంచి 18 ఏళ్లు నిండని మైనర్ బాలికలు గర్భం దాల్చిన వివరాలు వెల్లడించాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ విధి విక్రించడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. అయినా ఆ దంపతులు ఆ బిడ్డ జ్ఞాపకాలను మరువలేకపోయారు. అందుకే తమ బిడ్డకు ఓణీల కార్యక్రమం కూడా నిర్వహించి, ఆమె స్మృతిలో మైమరిచి పోయారు.