Home » Cinema News
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్గా ఎంజాయ్ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. హైదరాబాద్కు చెందిన బడా వ్యాపారి బర్త్డే సందర్భంగా బెంగళూరులోని ఫాంహౌస్లో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు.
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీఆర్ ఫామ్హౌస్లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్ ఫామ్హౌస్ అనేది హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది.
ఒకే ఒక్క చాన్స్ కోసం పరితపించలేదు. ‘వెండితెర’పై వెలిగిపోవాలనీ కలలు కనలేదు. విదేశాల్లో చదివి... ఉద్యోగం కోసం ముంబయి వచ్చి... అనుకోకుండా నటి అయింది పరిణీతి చోప్రా. కెరీర్ ఆరంభంలో దూసుకుపోయినా... ఆ తరువాత అపజయాలు ఎదురైనా... ఆమె ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు.
Telangana: సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి ఆహ్లాదం.. ఆనందాన్ని ఇస్తుంది. ప్రతీరోజు ఎంతో కష్టపడుతూ ఉండే మనిషికి సినిమా కొంత రిలీఫ్ను ఇస్తుందని చెప్పువచ్చు. వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది సినిమాలకు వెళుతుంటారు. మరి కొంతమంది తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్లకు పడుతుంటారు. అయితే ఇటీవల తెలంగాణలో లోక్సభ ఎన్నికల కారణంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాని పరిస్థితి. దీంతో థియేటర్లు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఊహించని షాక్ ఇచ్చింది.
#90's మిడిల్ క్లాస్ బయోపిక్.. ఈ వెబ్ సిరీస్కు ప్రతి ఒక్కరూ బాగా కనెక్ట్ అయ్యారు. ఇందులో ఉన్న 90ల్లోని వాతావరణం, ఫ్యామిలీ గొడవలు, స్కూల్ లైఫ్, ఫస్ట్ లవ్, ఫ్రెండ్షిప్ ఇలా ప్రతి ఇన్సిడెంట్ అందరికీ కనెక్ట్ అయింది.
ఓటీటీల్లో క్రైం థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలో నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కించిన కర్రీ అండ్ సైనైడ్.. అనే డాక్యుమెంటరీ సినిమా ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా టాప్-3లో దూసుకుపోతోంది.
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా, ప్రముఖ నటి, మోడల్ లిన్ లైష్రామ్ నవంబర్ 29న ఓ ఇంటివారయ్యారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. ఈ జంట సోమవారం రిసెప్షన్ నిర్వహించింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రెండు దశాబ్దాల తర్వాత ఓ హిందీ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. గిరిజన సంస్థ హ్మార్ స్టూడెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్ఏ) మంగళవారం సాయంత్రం చురచంద్పూర్ జిల్లాలోని రెంగ్కాయ్ (లంకా)లో హిందీ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ప్లాన్ చేసింది.
టాలీవుడ్ యువ హిరో విశ్వక్ సేన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే తాను జీవితంలో కొత్త దశలోకి అడుపెట్టబోతున్నానేది ఆ పోస్టు సారాంశం. పూర్తి వివరాలను ఆగష్టు 15న వెల్లడిస్తానని ఆ పోస్టుకు క్యాప్షన్గా కూడా పెట్టాడు.
గురువారం రజినీ కాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమా నచ్చని ఇద్దరు అభిమానులు మీడియాకు నెగెటివ్ రివ్యూ ఇవ్వడాన్ని తలైవా అభిమానులు జీర్ణించులేకపోయారు. వారిద్దరిపై భౌతిక దాడికి దిగారు.