Home » CM Revanth Reddy
సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని పేట్ బషీరాబాద్ పీఎస్కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.
మాజీమంత్రి మల్లారెడ్డిని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారా..? అందుకే వరసగా భూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారా..? అంటే ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు.
ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ధరణి కమిటీని ఏర్పాటు చేసింది. సమస్యలపై కమిటీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ధరణిలో మొత్తం 119 తప్పలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించింది. స్పెషల్ డ్రైవ్ చేపట్టిన తర్వాత 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని ధరణి కమిటీ పేర్కొంది.
పంట రుణాల మాఫీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రుణమాఫీ పథకం కోసం పంద్రాగస్టును గడువుగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. రూ.2 లక్షల దాకా ఉన్న రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేందుకు ప్రత్యేకంగా ‘రైతు సంక్షేమ కార్పొరేషన్’ (ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్- ఎఫ్డబ్ల్యూసీ) ఏర్పాటుచేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం తెలిసిందే.
ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను ఆగస్గు 15 లోపు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీ అంశంమే ప్రధాన ఎజెండాగా శనివారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశమవుతోంది.
రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై అధికారుల స్థాయిలో కసరత్తు ప్రారంభమైంది. పెంపునకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూములు, భవనాలు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ ఎంత పెరుగుతుందనే విషయమై రియల్ ఎస్టేట్ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది.
నాలుగు నెలల కాలంలోనే రాష్ట్రానికి సుమారు 20వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు జరిగాయని, వచ్చే నాలుగేళ్లలో వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) విషయంలో యుటిలిటీ చార్జీలను చెల్లించబోమని గత బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి లేఖ రాయడంతో మొత్తం ప్రాజెక్టే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యుటిలిటీ చార్జీల కింద రూ.363.43 కోట్లను చెల్లిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి, తాను కలిసి లేఖ రాశామని వెల్లడించారు.
ఒడిసాలో ఐదో దశ ఎన్నికలు జరిగే లోక్సభ నియోజక వర్గాల్లో డిప్యూటీ సీఎం భట్టి విస్తృత ప్రచారం చేపట్టారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆయన ఒడిసాలోనే మకాం వేసి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ ముగిసిన అనంతరం మంగళవారమే ఆయన ఢిల్లీకి వెళ్లారు. బుధవారం అక్కడి నుంచి ఏఐసీసీ అగ్రనేతలతో పాటుగా ప్రత్యేక విమానంలో ఒడిసాకు వెళ్లిన భట్టి.. బోలాంగిరి పరిధిలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా అందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని తప్పనిసరిగా గెలిపించాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రె్సను గెలిపిస్తే.. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించే ప్రమాదం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.