Home » Congress Govt
‘‘బస్సు ప్రయాణాన్ని (మహిళలకు) ఉచితం చేశారు. మెట్రోను ఖాళీ చేశారు. మరిప్పుడు మెట్రో ఎలా నడుస్తుంది? దేశం ఎలా ముందుకు సాగుతుంది?’’ ..అంటూ ప్రధాని మోదీ కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకంపై పరోక్ష విమర్శలు చేశారు!
కాంగ్రెస్ పార్టీపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి ధ్వజమెత్తారు. భారత తొలి ప్రధాని నెహ్రూ హయాంలోనే చైనా దురాక్రమణకు దేశ భూభాగాన్ని కోల్పోయామన్నారు
ఈ నెల 18 వ తేదీన తెలంగాణ కేబినేట్ భేటీ కానున్నది. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమస్యలు, ఉమ్మడి ఏపీతో పీట ముడిగా ఉన్న సమస్యలపై పరిష్కారం దిశగా ఈ భేటీలో చర్చించనున్నారు.వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల కొనుగోళ్లపై మంత్రి వర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
ఎండాకాలంతో జూరాల ప్రాజెక్ట్లో నీరు లేకపోవడంతో అక్కడి ప్రజలు సాగు, తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తితో కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. నారాయణపూర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలపై బుధవారం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.
రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం తెలంగాణ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్లతో సఖ్యతగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. అంతా పాజిటివ్ థింకింగ్ మాత్రమే.. నో నెగెటివ్ థింకింగ్ అని చెప్పారు. తన ప్రపంచం అంతా తెలంగాణనే అని అన్నారు. వంద సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక అందించడమే తన లక్ష్యమని తెలిపారు.
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. మంగళవారం గాంధీభవన్లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో తాము అధికారంలో ఉన్నాం కదా అని ఎవరికి ఇబ్బంది కలిగేంచేలా ప్రవర్తించలేదని చెప్పారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం సమీక్ష చేశారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధిలో గాలి వాన, పిడుగులు పడి సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు.