Home » Delhi
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయంలో తామేమీ ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఏది న్యాయసమ్మతమని భావించామో దానిని మేం మా తీర్పులో స్పష్టం చేశాం’ అని తెలిపింది.
ఇండియా’ కూటమి సభలకు దూరంగా ఉంటున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మరోమారు స్పందించారు. ‘‘ఇండియా కూటమిని నేనే నిర్మించాను. ఆ కూటమిలోనే ఉన్నాను.
లోక్సభ 2024 ఎన్నికలకు(lok sabha elections 2024) ముందే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో గుండె, కాలేయం, మధుమేహం సహా అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలను(medicines rates) తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని గత వారం ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను ఏపీ ప్రభుత్వం కొనసాగించింది.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఒకవైపు అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లతో కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత పీవోకేని తిరిగి భారత్లో కలుపుతామని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లోని సిరాంపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. 370 అధికరణం రద్దు తర్వాతే జమ్ము కశ్మీర్లో శాంతి పవనాలు వీస్తున్నాయని, స్వేచ్ఛా నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయని తెలిపారు.
‘‘తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు 420 హామీలిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై దాటవేసే ధోరణిని అవలంబిస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇష్టారీతిన హామీలిచ్చాయి’’ అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి విమర్శించారు. బుధవారం ఇక్కడ తన అధికారిక నివాసంలో మీడియా సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు.
‘హిందూ-ముస్లిం’ రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నానని ప్రధాని మోదీ అన్నారు. అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజాజీవితంలో కొనసాగేందుకు తాను అర్హుడినే కాదని స్పష్టం చేశారు. 2002లో గోద్రా ఘటన తర్వాత తన ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీశారని విపక్షాలను విమర్శించారు. ‘ఆంగ్ల వార్తాచానల్ సీఎన్ఎన్-న్యూ్స18’కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడూ ముస్లింలను చొరబాటుదారులని అనలేదన్నారు. ఎక్కువ మంది పిల్లలను కలిగిఉన్నది ముస్లింలేనని కూడా అనలేదని తెలిపారు.
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసులో బుధవారం అరెస్టు చేసింది. ఆలంగీర్ ఆలమ్ పర్సనల్ సెక్రటరీ(పీఎస్) సంజీవ్ లాల్ పని మనిషి జహంగీర్ ఆలమ్ ఇంట్లో రూ.35.23 కోట్లు దొరికిన కేసులో ఈడీ చర్యలు తీసుకుంది. ఆలంగీర్ ఆలమ్ను బుధవారం వరుసగా రెండో రోజు విచారణకు పిలిచిన ఈడీ ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించింది.
భారత రక్షణ రంగంలో కీలక ముందడుగు పడింది. మెషిన్గన్తో శత్రువులపై విరుచుకుపడే అత్యాధునిక హెక్సాకాప్టర్ డ్రోన్ను భారత సైన్యం పరిచయం చేసింది. ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఇక్రాన్ ఏరోస్పేస్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ దీన్ని రూపొందించింది. ఇదొక మానవ రహిత ఏరియల్ వాహనం (యూఏవీ).
నాన్స్టిక్ వంటపాత్రలతో తీవ్రమైన ఆరోగ్యసమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎమ్మార్) హెచ్చరించింది.