Home » Delhi Excise Policy
మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. జూన్ 1వ తేదీ వరకూ ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు ఆయనను సాయంత్రం విడుదల చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Scam Liquor Case) మార్చి 15న కవితను అరెస్టు చేసి... మరుసటి రోజు రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు ముందు ఈడీ హాజరుపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు(శుక్రవారం) ఈ కేసులో ఎన్ఫోర్సమెంట్ డైరక్టరేట్ - ఈడీ ఏడో ఛార్జిషీట్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మరో నలుగురు నిందితుల పాత్రపై దర్యాప్తు సంస్థ ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికలు మధ్యలో ఉండగా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. పలు షరతుల మీద కేజ్రీవాల్కు జూన్ 1వ తేదీ వరకూ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
డిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహాడ్ జైల్లో ఉన్నారు. ఆ క్రమంలో బెయిల్ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ట్రయల్ కోర్టు రౌస్ అవెన్యూలో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. దాంతో హైకోర్టును ఆశ్రయించాలని కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు.
ఎక్సైజ్ పాలసీ కేసులో 'ఆప్' నేత మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన రెండోసారి దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తును రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. ఆయనకు బెయిల్ ఇచ్చే విషయంపై సీబీఐ, ఈడీలు రెండూ అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో మంగళవారంనాడు విచారణ జరిగింది. కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సమయంపై స్పందించాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మే 7వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది.
దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) .. ఇప్పట్లో జైలునుంచి బయటికి వచ్చే పరిస్థితులు మాత్రం అస్సలు కనిపించట్లేదు. జైలు నుంచి బయటికి రావడానికి బెయిల్ కోసం కవిత చేస్తున్న విశ్వప్రయత్నాలన్నీ..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ను రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం (రేపు) విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టైన సంగతి తెలిసిందే. కవితను ఈడీ పలుమార్లు విచారించి మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కవిత జైలులో ఉండగానే సీబీఐ అధికారులు కవితను ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేశారు.