Home » Karnataka
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రజల్వ్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మౌనం వీడారు. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉందనే సంకేతాలిచ్చారు. ఈ కేసులో ఎవరెవరికి ప్రమేయం ఉందో వారందరిపైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే వారి పేర్లు తాను చెప్పదలచుకోలేదన్నారు.
కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు ఓ కుదుపు కుదిపేశాయి. వీడియోలు బయటకు వచ్చేందుకు కారణం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అని బీజేపీ నేత జి దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కుమారస్వామిని రాజకీయంగా ఫినిష్ చేయాలనేది శివకుమార్ టార్గెట్ అని బాంబ్ పేల్చారు. అందుకోసం తనను సంప్రదించారని వివరించారు.
ఎండాకాలంతో జూరాల ప్రాజెక్ట్లో నీరు లేకపోవడంతో అక్కడి ప్రజలు సాగు, తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తితో కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. నారాయణపూర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది.
బెంగళూరు మహానగరంలో డెంగ్యూ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ ప్రకటించినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ కమిషనర్ వికాస్ కిషోర్ వెల్లడించారు.
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల బాధితురాలిని అపహరించారనే కేసులో ఆయన తండ్రి, జనతాదళ్ సెక్యులర్ నేత, హోలెనర్సిపుర ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ సోమవారంనాడు మంజూరు చేశారు.
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ల వ్యవహారంలో 'సిట్' విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న చేతన్, లిఖిత్ అనే ఇద్దరు వ్యక్తులను హసన్లో ఆదివారంనాడు అరెస్టు చేసింది.
లోక్సభ ఎన్నికల మధ్యలో సంచలనం సృష్టించిన హస్సన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర రాజకీయ పార్టీలు, నేతలకు అదివారంనాడు కీలక సూచనలు చేశారు. కేసు సున్నితత్వం దృష్ట్యా ఎవరూ ఎలాంటి బహిరంగ ప్రకటనలు కాని, సమాచారం షేర్ చేయడం కానీ చేయవద్దని కోరారు.
స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కర్ణాటకకు చెందిన మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ(SM Krishna) తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో ఏప్రిల్ 30న మణిపాల్ ఆసుపత్రిలో చేరారు.
విమాన(flight) ప్రయాణంలో భాగంగా అప్పుడప్పుడు మంటలు రావడం, ఏసీలు పనిచేయకపోవడం, ప్రయాణికుల వింత చేష్టల వంటి అనేక సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటివల కూడా అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. ఏమైందోనేది ఇక్కడ తెలుసుకుందాం.
సీఎం పదవి కోసం డీకే శివకుమార్(DK Shivakumar) ఆత్రుత పడరాదని బీజేపీ నేత, తుమకూరు లోక్సభ అభ్యర్థి సోమణ్ణ(Somanna) సూచించారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.