Home » Lok Sabha Election 2024
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీతో కూడిన విపక్ష ఇండియా కూటమి గెలిస్తే అయోధ్యలో రామమందిరాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని ప్రధాని మోదీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పల్నాడు జిల్లా కలెక్టర్పై బదిలీ వేటు పడింది.
రాయబరేలి ప్రజలు ప్రధానిని ఎన్నుకుంటారంటూ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం 'హ్యాట్రిక్' సాధించి తీరుతుందని అన్నారు. 'ఇండియా' కూటమి నేతలు ఒక్కొక్కరే జారుకుంటున్నారని అన్నారు.
ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని నరేంద్ర మోదీ అధిష్టాస్తారని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో 400 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. వైయస్ వివేకా హాత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించ కూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అలాగే వైయస్ షర్మిలతో పాటు ఇతరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపైనా కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది.
తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసేస్తామన్న విపక్ష ‘ఇండీ’ కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ చట్టాన్ని ఎవరూ తీసివేయలేరని, ఏం చేస్తారో చేసుకోండని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. గురువారం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో పలు చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
లోక్సభకు ఆరో దశలో జరగనున్న ఎన్నికల్లో 92 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. ఈ దశ ఎన్నికల బరిలో ఉన్న 869 మంది అభ్యర్థుల్లో 866 మంది అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విశ్లేషించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఈవీఎంల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.
జూన్ 4వ తేదీ లోపు మరిన్ని దాడులు జరగవచ్చని.. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నాయకుడు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు సూచించారు.
భారీ భద్రత మధ్య తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు.