Home » National
ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పుణె విమానాశ్రయం నుంచి 180 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది. పుణె విమానాశ్రయంంలో రన్వే దిశగా వెళుతున్న తరుణంలో లగేజీ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తమ్లూక్ బీజేపీ అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంతకు అమ్ముడు పోతున్నారు?’ అని ప్రశ్నించారు. బెంగాల్లోని ఈస్ట్ మిడ్నాపూర్ ఎన్నికల ప్రచారంలో అభిజిత్ గంగోపాధ్యాయ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎయిర్ ఇండియా విమానంలో బుధవారం ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ విమానం టేకాఫ్కి సిద్ధంగా ఉన్న సమయంలో.. ఓ ఊహించని పరిణామం కారణంగా పెద్ద అలజడి..
పాకిస్తాన్ గూఢచర్యం కేసులో పరారీలో ఉన్న కిలక నిందితుడైన నసీరుద్దీన్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నసీరుద్దీన్ పై గతంలో ఎన్ఐఏ రూ.5 లక్షల రివార్డ్ను ప్రకటించింది. మైసూరులో నసీరుద్దీ్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి కీలక డాక్యుమెంట్లతో పాటు.. ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు, పెన్డ్రైవ్ లు, డ్రోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అరుదైన ఘటనకు అమెరికాలోని అధికార భవనం శ్వేత సౌధం (White House) వేదికగా మారింది. వందలాది ఆసియా అమెరికన్ల ముందు వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ మహ్మద్ ఇక్బాల్ రచించిన ‘సారే జహాసే అచ్ఛా’ను ప్లే చేయగా ఆహుతులంతా ఎంజాయ్ చేశారు. హెరిటేజ్ మంత్ వేడుకల్లో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. వచ్చిన అతిథులంతా పానీ పూరి తింటూ మరోవైపు సారే జహాసే అచ్చా వింటూ మురిసిపోయారు.
నాన్స్టిక్ వంటపాత్రలతో తీవ్రమైన ఆరోగ్యసమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎమ్మార్) హెచ్చరించింది.
బస్సుల్లో.. బస్టాండుల్లో, రైళ్లలో.. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల జేబులను చోరి చేయడం సహజంగా వింటుంటాం.. చూస్తుంటాం. కానీ విమాన ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకొని వారి విలువైన ఆభరణాలను చాకచక్యంగా కొట్టేస్తున్న ఓ చోర శిఖామణి ఆటను ఢిల్లీ ఎయిర్పోర్ట్ పోలీసులు కట్టించారు.
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ మాజీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి 9.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర యూనిట్ సోమవారం రాత్రి ట్విటర్ వేదికగా వెల్లడించింది.
నేడు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేయనున్న విషయం తెలిసిందే. నామినేషన్ కంటే ముందు దశాశ్వమేధ ఘాట్ సందర్శించనున్నారు. అనంతరం క్రూజ్లో నమో ఘాట్ వరకూ ప్రయాణించనున్నారు. ఆ తర్వాత కాలభైరవ ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంది.
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధుల మంజూరులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. కేంద్రం గత రెండేళ్లుగా ఈ నిధులను సకాలంలో ఇవ్వడం లేదు. ఇలా సుమారు రూ.500 కోట్లు కాలాతీతం కావడంతో మురిగిపోయాయి. కేంద్రం తీరుతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణపై వివక్ష చూపుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి.