Home » Odisha
ఒడిసాలో ఐదో దశ ఎన్నికలు జరిగే లోక్సభ నియోజక వర్గాల్లో డిప్యూటీ సీఎం భట్టి విస్తృత ప్రచారం చేపట్టారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆయన ఒడిసాలోనే మకాం వేసి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ ముగిసిన అనంతరం మంగళవారమే ఆయన ఢిల్లీకి వెళ్లారు. బుధవారం అక్కడి నుంచి ఏఐసీసీ అగ్రనేతలతో పాటుగా ప్రత్యేక విమానంలో ఒడిసాకు వెళ్లిన భట్టి.. బోలాంగిరి పరిధిలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు.
నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ పార్టీ అధికారంలోకి రాగానే ఒడిశా ప్రజలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. నవీన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే.. ఈ ఉచిత విద్యుత్పై తొలి ఉత్తర్వులు జారీ చేస్తారని పేర్కొంది.
లోక్సభ ఎన్నికల నాలుగో దశలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమియేతర పార్టీలపైనే పరిశీలకుల దృష్టి ప్రధానంగా ఉంది. త్రిశంకు సభ (హంగ్ పార్లమెంటు) ఏర్పడిన పక్షంలో (నెల రోజుల క్రితం కంటే ఇది ఇప్పుడు సంభావ్య పరిణామంగా కనిపిస్తోంది) ప్రభుత్వం ఏర్పాటులో ఈ ‘అలీన’ పార్టీలే కీలక పాత్ర వహించనున్నాయి.
ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పాలంటూ ప్రధాని మోదీ చేసిన సవాల్పై బిజు జనతాదళ్ (బీజేడీ) చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. అసలు మీకు ఒడిశా గుర్తుందా?
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రె్సకు కనీసం 50 సీట్లు కూడా రావని, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కదని ప్రధాని మోదీ అన్నారు. ఈసారి ఎన్డీఏ అన్ని రికార్డులను బద్దలుకొట్టి 400 సీట్లకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఒడిసాలోని పలు లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో మాట్లాడారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు కాంధమాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి, బీజేడీ నేత నవీన్ పట్నాయక్ కు సవాల్ విసిరారు. ఒడిశాను సుదీర్ఘ కాలంగా పాలించిన పట్నాయక్ పేపరు చూడకుండా అన్ని జిల్లాల పేర్లు చెప్పాలని ఛాలెంజ్ చేశారు.
భారతీయ జనతా పార్టీ తొలిసారి ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లలో ఎన్డీయే గెలువనుందని, విపక్షంలో కూర్చునేందుకు అవసరమైన సీట్లు కూడా కాంగ్రెస్కు రావని చెప్పారు.
ఒడిశాలో సార్వత్రిక సమరానికి మరి కొన్ని గంటలే మిగిలున్న వేళ బీజేపీ(BJP) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మే 13న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఒడిశాలో(Odisha) శనివారం ప్రధాని మోదీ(PM Modi) పర్యటించనున్నారు.
ఒడిసా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? పాతికేళ్ల నవీన్ పట్నాయక్ పాలనను మార్చాలని చూస్తున్నారా? ఇదే అదునుగా బీజేపీ పుంజుకుని, విజయం దక్కించుకునేందుకు తహతహలాడుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు.
ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వం మే 4వ తేదీతో ముగుస్తుందని.. అనంతరం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని మోదీ పగటి కలలు కంటున్నారని ఆయన పేర్కొన్నారు.