Home » Rajastan
సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటాయి. కానీ రాజస్థాన్లోని ఓ మంత్రి మాత్రం సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి చెందిన ఓ ప్రాజెక్టులో రూ.1,140 కోట్ల నష్టం జరిగిందని ఆయన మీడియా ముఖంగా చెప్పడం చర్చనీయాంశం అవుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉండాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ(Rajasthan Chief Minister Bhajanlal Sharma) ప్రజలను కోరారు.
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసి అడ్డంగా దొరకిపోయిన ఘటన రాజస్థాన్లో(Rajasthan) జరిగింది. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ యూజీ(NEET - UG) పరీక్షలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్పుర్ జిల్లాలో అభ్యర్థికి బదులు పరీక్ష రాస్తూ ఓ ఎంబీబీఎస్ విద్యార్థి పట్టుబడ్డాడు.
రాజస్థాన్(Rajasthan) సవాయ్ మాధోపూర్(Sawai Madhopur)లోని ఎక్స్ప్రెస్వేపై ఘోర ప్రమాదం(accident) జరిగింది. ఓ గుర్తు తెలియని వాహనం ఆకస్మాత్తుగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత చెందగా, ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.
వినోద సమయాల్లో కొన్నిసార్లు ఉన్నట్టుండి విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. ‘‘అయ్యో పాపం..!’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
లోక్సభ 2024 ఎన్నికల(Lok Sabha election 2024) నేపథ్యంలో రెండో దశ(second phase) ఎన్నికల ప్రచారానికి(election campaign) నేడు చివరి రోజు. దీంతో ప్రధాన పార్టీలు స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అభ్యర్థులు తమకు అనుకూలంగా ఓట్లు వేయాలని అభ్యర్థించనున్నారు.
యూపీఏ అధికారంలో ఉన్నన్నినాళ్లూ దేశం దివాలా తీసిందని.. ఆ పార్టీ భారత్ను ఎన్నడూ బలోపేతం చేయలేదని ప్రధాని మోదీ(PM Modi) ధ్వజమెత్తారు. రాజస్థాన్లోని జలోర్ జిల్లాలో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
రాజస్థాన్(Rajasthan)లోని ఝలావర్(Jhalawar)లో ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాంగ్రెస్ పార్టీ వెనకబడిన తరగతులకు వ్యతిరేకమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) ఆరోపించారు. రాజస్థాన్లోని కోటా లోక్సభ ఎంపీ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో షా ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను విపక్షాలు తొలగించాలని కోరుతున్నప్పటికీ.. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో వాటిని తొలగించదన్నారు.
సోషల్ మీడియాలో పులులు, సింహాలకు సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వేటాడే పులులు కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు చెట్టుపై ఉన్న జంతువులను కూడా వేటాడటం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...