Home » Revanth
రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఆ కార్పొరేషన్ ద్వారా ఆదాయం చూపించి రుణం తీసుకుంటామని, దాని ద్వారానే రైతుల రుణమాఫీ అమలు
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మే 13వ తేదీ అంటే.. సోమవారం రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలతోపాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల విధుల్లో మొత్తం 2 లక్షల 91 వేల మంది సిబ్బందిని పాల్గొనున్నారు.
ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. రోజు కనీసం రెండు, మూడు చోట్ల సభల్లో పాల్గొంటున్నారు. ఆయా చోట్ల స్థానిక సమస్యలను ఎత్తి చూపుతున్నారు. అందుకోసం కొత్త ఎత్తుగడ వేశారు. జనాలను తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు.
‘‘కేసీఆర్పై ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా ప్రారంభించనే లేదు.. తుపాకీ సిద్ధంగా ఉంది. ఒక్క తూటా చాలు.. నేను పిల్లులు, కుక్కలను కొట్టను. కొడితే పులినే కొడతాను’’ అని సీఎం రేవంత్ రెడ్డి ‘ఇండియా టీవీ’ సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ను కొట్టాలంటే అసెంబ్లీలోనే వెళ్లి కొట్టేవాడినని.. అందుకు కుర్చీయే (అధికారమే) అవసరం లేదని చెప్పారు.
రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ( Telangana ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఓ వైపు సీనియర్లు పార్టీని వీడుతుంటే.. మరోవైపు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతుంది. తాజాగా కామారెడ్డి బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె ఛైర్ పర్సన్ పదవి కోల్పోయారు. కామారెడ్డి కొత్త మున్సిపల్ ఛైర్ పర్సన్గా కాంగ్రెస్ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు.
బళ్ళు ఓడలవుతాయి.. ఓడలు బళ్ళవుతాయి అంటే ఇదేనేమో.. తెలంగాణ ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే ఈ సామెత గుర్తొస్తుంది. బీఆర్ఎస్ టికెట్ల కోసం విపరీతమైన పోటీ.. టికెట్ కోసం పైరవీలు.. బల నిరూపణలు.. అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు.. ఒక టికెట్ కోసం పది, ఇరవై మంది పోటీ.. ఇది ఒకప్పటి బీఆర్ఎస్ పరిస్థితి.
భారత రాష్ట్ర సమితి ఎమ్యెల్యేలు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల గురించి కాంగ్రెస్ నేతలు ఒక్కో సంఖ్య చెబుతున్నారు. మరికొందరెమో బీఆర్ఎస్ఎల్పీ విలీనం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా తనను నియమిస్తారని వచ్చిన వదంతులపై ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ స్పందించారు. తనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సంప్రదించిన మాట వాస్తవమేనని అన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు స్పీకర్కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్ను కలిసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ ఉన్నారు.