Home » Rohit Sharma
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ టీమ్ తన ఆఖరి మ్యాచ్ ఆడేసింది. శుక్రవారం వాంఖడే స్టేడియం వేదికగా లఖ్నవూ సూపర్ జెయింట్స్తో ముంబై ఇండియన్స్ టీమ్ తలపడింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో ఏకంగా 68 పరుగులు చేశాడు.
ఇటీవల రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అందులో కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో మాట్లాడుతూ కనిపించిన రోహిత్..
రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ టీమ్ అనవసర వివాదాలను ఎదుర్కొంటూనే ఉంది. హార్దిక్ను కెప్టెన్ చేయడాన్ని చాలా మంది ముంబై ఫ్యాన్స్ వ్యతిరేకించారు. అన్ని విమర్శల నడుమ ముంబై టీమ్ నాయకత్వం చేపట్టిన హార్దిక్ ఘోరంగా విఫలమయ్యాడు.
ఐపీఎల్ 2024 (IPL 2024)లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్(MI) జట్టు ప్లేఆఫ్ రేసులో లేదు. కానీ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నేటి మ్యాచ్కు ముందు తన పాత స్నేహితుడిని కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో KKR జట్టు సహాయ కోచ్ అభిషేక్ నాయర్(Abhishek Nayar)తో రోహిత్ శర్మ మాట్లాడటం కనిపిస్తోంది.
ముంబై ఇండియన్స్ జట్టుని రోహిత్ శర్మ వీడనున్నాడా? తదుపరి ఐపీఎల్ సీజన్లో అతను మరో ఫ్రాంచైజీకి జంప్ కానున్నాడా? అంటే.. అవుననే అభిప్రాయాలే క్రీడా వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఐపీఎల్ సీజన్ హార్దిక్ పాండ్యాకు ఏమాత్రం కలిసిరాలేదు. అసలు రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతడిని నియమించినప్పటి నుంచే విమర్శలు వస్తున్నాయి. ఐదు ఐపీఎల్ టైటిల్స్ని..
వచ్చే నెలలో జరగబోతున్న టీ20 ప్రపంచకప్ ఆడే భారత జట్టులో రోహిత్ శర్మ ఉండడం ఎంతో కీలకమని, అతడు తెలివైన కెప్టెన్ అని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసించాడు. యువరాజ్, రోహిత్ కలిసి 2007 టీ20 ప్రపంచకప్ ఆడారు.
శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగడంపై రకరకాల అనుమానాలు తెరమీదకి వస్తున్నాయి. అసలెందుకు రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు?
అందరి అంచనాలకు భిన్నంగా టీ20 వరల్డ్ కప్ 2024 ఆడబోయే భారత జట్టులో యువ సంచలన రింకూ సింగ్కి చోటు దక్కలేదు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా, రింకూ సింగ్కి ఓదార్పునిచ్చేలా వ్యవహరించాడు. భారత జట్టు ఎంపికను సమర్థిస్తూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ నిన్న (గురువారం) ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు.
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫి పాకిస్థాన్లో జరగాల్సి ఉంది. ఆసియా కప్ సమయంలో వేదికల గురించి ఇండియా, పాకిస్థాన్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దాంతో ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్లో భారత్ ఆడుతుందా..? లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.