Home » Tamil Nadu
రాష్ట్రంలో అగ్ని నక్షత్రం ఎండ వేడి అధికం కాకుండా పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురవటంతో వాతావరణం తరచూ చల్లబడుతోంది. ఈ నేపథ్యంలో తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి(Chennai Central to Tirupati) వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ రైళ్లు బుధవారం నుంచి ఈ నెల 31వ తేది వరకు తిరుపతికి బదులుగా రేణిగుంట వరకు మాత్రమే వెళతాయని దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
గడిచిన నాలుగేళ్లలోనే రాష్ట్రంలో 36,137 మంది బాలికలు గర్భం దాల్చినట్లు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానం అందింది. రాణిపేట జిల్లా మనపాక్కం ప్రాంతానికి చెందిన న్యాయవాది, పిల్లల హక్కుల కార్యకర్త సి.ప్రబాకరన్(C. Prabakaran), రాష్ట్రంలో 2021 నుంచి 18 ఏళ్లు నిండని మైనర్ బాలికలు గర్భం దాల్చిన వివరాలు వెల్లడించాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ విధి విక్రించడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. అయినా ఆ దంపతులు ఆ బిడ్డ జ్ఞాపకాలను మరువలేకపోయారు. అందుకే తమ బిడ్డకు ఓణీల కార్యక్రమం కూడా నిర్వహించి, ఆమె స్మృతిలో మైమరిచి పోయారు.
యూట్యూబ్(Youtube) చూస్తూ బ్యాంక్లో చోరీకి యత్నించిన ఎంబీఏ పట్టభద్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై పోలీసుల కథనం మేరకు... మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపం అరియపట్టి గ్రామానికి చెందిన లెనిన్ (30) ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంక్లో పనిచేస్తున్నాడు.
క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని)Cricketer Mahendra Singh Dhoni)కి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఆయన క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.
మదురైలో శనివారం కురిసిన అకాల వర్షం వాతావరణాన్ని చల్లబరిచినప్పటికీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీర ప్రాంతంలో వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి.
భార్య వివాహేతర సంబంధాన్ని జీర్ణించుకోలేని భర్త తన ఇద్దరు పిల్లలను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న విషాదక ఘటన శనివారం నగరంలో చోటుచేసుకుంది. వెస్ట్ మాంబాళం కృష్ణప్ప నాయకర్ వీధికి చెందిన మోహన్ (55) పాత ఇనుప వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు భార్య యమున, సాయి స్వాతి (13), తేజర్ (5) అనే ఇద్దరు పిల్లలున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు (AP Elections) మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈసారి ఓటు వేయాల్సిందేనని తెలుగోడు గట్టిగా ఫిక్సయ్యాడు!. అందుకే దేశ విదేశాల్లో ఉన్న పలువురు ఓటర్లు ఇండియాకు విచ్చేయగా.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు కూడా వచ్చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు (Telugu People) ఓటింగ్పై ఆసక్తిగా ఉన్నారు...
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (AP Elections 2024) మరో మూడు రోజుల్లో జరుగనున్నాయి. రేపటితో ప్రచారానికి కూడా తెరపడనుంది. ఈనెల 13న రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఓటింగ్పై ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏపీకి ప్రయాణాలు మొదలయ్యాయి కూడా.