Home » Vijayawada
Andhrapradesh: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఇటు హైదరాబాద్, అటు బెజవాడలో ఉన్నట్టుండి వర్షం కురిసింది. భాగ్యనగరంలో గంట పాటు వర్షం పడగా.. అటు విజయవాడలో మాత్రం వర్ష బీభత్సం కొనసాగుతోంది. బెజవాడలో గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.
ఓ వైద్యురాలి అప్రమత్తత ఆరేళ్ల బాలుడి ఆయువు నిలిపింది. రహదారి మీదనే సీపీఆర్ చేయడంతో బాలుడి ప్రాణం నిలిచింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వైద్యురాలు రవళికి ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. విజయవాడలోని అయ్యప్ప నగర్లో ఆరేళ్ల బాలుడు సాయి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
ఏపీలో వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది, పోలీసులు.. ఇలా అందరిపైనా అరాచకంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల దాకా వైసీపీ మూకల హింసాకాండ యథేచ్ఛగా కొనసాగింది. ఆ పార్టీ దౌర్జన్యాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే.. వైసీపీ మూకలు ఏకంగా ఎస్పీ వాహనంపైనే రాళ్లు విసిరారు! పోలీసులే ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు.
Andhrapradesh: ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ‘‘ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆంధ్రావైపే చూస్తుంది. గతంలో 151 అనేదే చాలా పెద్ద నెంబర్.. 22 ఎంపీ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్యే.. ఈసారి 151 కంటే ఎక్కువ స్ధానాలు, 22 ఎంపీ స్ధానాలు కంటే ఎక్కువ సాధిస్తాం’’ అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీలో పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, నిమ్రా కాలేజ్ స్ట్రాంగ్ రూంలకు అధికారులు తరలిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు శాసనసభ నియోజకవర్గం నుంచి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఈవీఎం బ్యాలెట్లో 13 వరుసలు ఉండగా.. మొదటి 12 అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు, చివరిది నోటా. మొదటి నలుగురు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కాగా.. మిగతా 8 మంది రిజిస్టర్డ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గం నుంచి మొత్తం 9 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో ప్రధానపార్టీ అభ్యర్థులు నలుగురు ఉన్నారు. మిగతా ఐదుగురు రిజిస్టర్డ్, స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈవీఎంలో మొత్తం పది వరుసలు ఉండగా చివరిది నోటా.
ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కనీసం ఐదుగురు నుంచి 20 మంది వరకు పోటీలో ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో కొన్ని పోలింగ్ బూత్లలో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేశారు. సాధారణంగా ఓటు వేసేటప్పుడు ఓటర్లు ఎక్కువమంది అభ్యర్థులు ఉండటంతో కన్ఫ్యూజ్ అవుతూఉంటారు. ఒకరికి వేద్దామని వెళ్లి మరొకరికి వేసే అవకాశం ఉంటుంది.
Andhrapradesh: ఏపీలో పోలింగ్ ప్రారంభమైంది. అయితే పలుచోట్ల ఈవీఎంల మొరాయింపులతో పోలింగ్ ఆలస్యమైంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ పోలింగ్ ప్రారంభంకాని పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ ఆలస్యం కారణంగా రాజకీయ నేతలు కూడా పోలింగ్ కేంద్రాల్లో వేచి ఉండాల్సి వస్తోంది. ఇటు టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఉదయం ఏడు గంటలకే ఓటు వేసేందుకు వచ్చారు.
Andhrapradesh: ఓటు వేసేందుకు వస్తున్న ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్లో నిరీక్షిస్తున్నారు. అయితే రద్దీకి సరిపడా బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేయని పరిస్థితి. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది.