Home » YCP
అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. చివరికి ప్రశాంతమైన విశాఖలో కూడా వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
పేదల పక్షపాతినని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్ నిజస్వరూపం బయటపడింది. ఎన్నికలు పూర్తయినందున ప్రస్తుతం పేదల అవసరం లేదనుకున్నారేమో... వారిని పక్కనబెట్టి అస్మదీయులైన కాంట్రాక్టర్లకు మేళ్లు చేస్తున్నారు. ఎప్పుడో బటన్ నొక్కిన సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ నగదు జమ చేయకుండా అరకొర
తాడిపత్రి అల్లర్లను అరికట్టడంలో విఫలమైనందుకు ఎస్పీ అమిత బర్దర్పై సస్పెన్షన వేటు పడింది. తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక చర్యలను అరికట్టడంలో విఫలమైనందుకు ఎన్నికల కమిషన చర్యలు తీసుకుంది. ఆయనతోపాటు తాడిపత్రి డీఎస్పీ సీఎం గంగయ్య, సీఐ ఎస్.మురళీకృష్ణను సస్పెండ్ చేసింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ...
వైసీపీ అభ్యర్థుల్లో రోజురోజుకూ అభద్రతాభావం పెరిగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ముందు ఉన్న జోష్ వారిలో కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే గుబులు పట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల గెలుపుపై పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పోలింగ్ శాతం పెరగడం... యువత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనడం వైసీపీ అభ్యర్థులను, శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగవర్గాల్లో ఉన్న వ్యతిరేకత, అధికారంలో ఉన్నామనే దర్పంతో ఎమ్మెల్యేలు సాగించిన అక్రమాలు...
జూన్ 4వ తేదీ లోపు మరిన్ని దాడులు జరగవచ్చని.. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నాయకుడు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు సూచించారు.
భారీ భద్రత మధ్య తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు.
తాడిపత్రిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు టార్గెట్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఫ్యామిలీ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని గత వారం ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను ఏపీ ప్రభుత్వం కొనసాగించింది.
నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు, కిరాయి రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. దీంతో పలు గ్రామాలు ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. టీడీపీ శ్రేణులు, సానుభూతిపరులపై వరుస దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి.
పోలింగ్ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన వైసీపీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కళ్లకుంట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి