45మంది ప్రయాణికులున్న బస్సులో.. యువతిపై అత్యాచారం!

ABN , First Publish Date - 2020-08-31T02:08:34+05:30 IST

45మందితో ప్రయాణిస్తున్న బస్సులో ఓ యువతిపై అత్యాచారం జరిగింది.

45మంది ప్రయాణికులున్న బస్సులో.. యువతిపై అత్యాచారం!

న్యూఢిల్లీ: 45మందితో ప్రయాణిస్తున్న బస్సులో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు వెళ్తుండగా ఈ ఘాతుకం జరిగినట్లు బాధితురాలు తెలిపింది. 30 ఏళ్ల సదరు యువతి.. లక్నో నుంచి ఢిల్లీ వస్తోంది.


స్లీపర్ బస్సులో నిద్రిస్తుండగా.. బస్సు క్లీనర్ ఆమెను బలాత్కరించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బస్సులో 45మందిపైగా ప్రయాణికులున్నారని ఆమె చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-31T02:08:34+05:30 IST