గుజరాత్‌ టూ ఏపీ !

ABN , First Publish Date - 2020-05-01T08:43:30+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు గురువారం గుజరాత్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మత్స్యకారులను తరలించారు. దాదాపు 4,500

గుజరాత్‌ టూ ఏపీ !

  • 61 బస్సుల్లో 4,500 మంది మత్స్యకారుల తరలింపు 


నిర్మల్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు గురువారం గుజరాత్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మత్స్యకారులను తరలించారు. దాదాపు 4,500 మందిని  61 బస్సుల్లో  స్వస్థలాలకు పంపించారు. గురువారం ఈ వాహనశ్రేణి మహారాష్ట్ర సరిహద్దు నుంచి నిర్మల్‌ జిల్లా సరిహద్దు వద్ద తెలంగాణాలోకి ప్రవేశించింది. దీంతో రెవెన్యూ అధికారులతో కలిసి డీఎస్పీ నరసింహారావు బస్సులను తనిఖీ చేశారు. సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ గుజరాత్‌లోని గిరి సోమనాధ్‌ ప్రాంతం నుంచి మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని సొంత గ్రామాలకు వీరిని తరలిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-05-01T08:43:30+05:30 IST