ప్రణబ్ నాపై ఎంతో వాత్సల్యం చూపేవారు: మాజీ ఎంపీ యలమంచిలి

ABN , First Publish Date - 2020-09-01T19:14:43+05:30 IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల మాజీ ఎంపీ డాక్టర్ యలమంచిలి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ప్రణబ్ నాపై ఎంతో వాత్సల్యం చూపేవారు: మాజీ ఎంపీ యలమంచిలి

అమరావతి: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మాజీ ఎంపీ డాక్టర్ యలమంచిలి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనపై ఎంతో వాత్సల్యం చూపేవారని గుర్తుచేసుకున్నారు. తాను ప్రణాళికా సలహా మండలిలో సభ్యుడిగా ఉన్న సమయంలో వివిధ అంశాలపై తమ నివేదికలు చూసి ప్రణబ్ చాలా మెచ్చుకునేవారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేసిన సమయంలో తనను ఆయన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారని ఆయన చెప్పుకొచ్చారు. గుంటూరు వెళ్లొద్దని.. ఢిల్లీలోనే ఉండమని ప్రణబ్ అడిగారన్నారు. వ్యవసాయంపై నియమించే హైపవర్ కమిటీలో ఉండమని ఆఫర్ ఇచ్చారని... అదే సమయంలో తాను అమెరికా వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత తనతో ప్రణబ్ ముఖర్జీ చాలా ఆప్యాయంగా మాట్లాడేవారని తెలిపారు. ఆయన మృతి తీరనిలోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు యలమంచిలి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

Updated Date - 2020-09-01T19:14:43+05:30 IST