గ్రేటర్ ఫస్ట్ రౌండ్ ఫలితాలు వచ్చేశాయ్..

ABN , First Publish Date - 2020-12-04T17:01:29+05:30 IST

గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా

గ్రేటర్ ఫస్ట్ రౌండ్ ఫలితాలు వచ్చేశాయ్..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయినప్పట్నుంచి జనాలు టీవీలకు అతుక్కుపోయారు. మరోవైపు అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల వద్ద టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారు. అందరూ  అనుకున్నట్లుగానే తొలి రౌండ్ ఫలితం 11 గంటలకు వచ్చేసింది. 


తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మాత్రం బీజేపీ మొదటి స్థానంలో ఉండగా టీఆర్ఎస్ మాత్రం రెండో స్థానానికి పడిపోయింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,926 కాగా.. ఇందులో దాదాపు 40 శాతం ఓట్లు చెల్లలేదు. ఇంకా 34 లక్షలకు పైగా ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఆర్సీపురం, పటాన్‌చెరు డివిజన్లలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో బీజేపీ.. అధికార టీఆర్ఎస్‌కు అందని స్పీడ్‌లో దూసుకెళ్లినప్పటికీ ‘కారు’ పార్టీనే తొలి రౌండ్‌లో లీడ్‌లో ఉంది. బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో దూసుకెళ్లిన బీజేపీ అదే ఊపును తొలి ఫలితం వరకూ కంటిన్యూ చేయలేకపోయింది.

Updated Date - 2020-12-04T17:01:29+05:30 IST