సైకో కిల్లర్ ఎన్‌కౌంటర్..ఐదుగురు పోలీసులకు గాయాలు

ABN , First Publish Date - 2020-12-04T11:51:38+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాంలో జరిగిన ఎన్‌కౌంటరులో పోలీసులు ఓ సైకో కిల్లరును హతమార్చారు....

సైకో కిల్లర్ ఎన్‌కౌంటర్..ఐదుగురు పోలీసులకు గాయాలు

భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాంలో జరిగిన ఎన్‌కౌంటరులో పోలీసులు ఓ సైకో కిల్లరును హతమార్చారు. గుజరాత్ రాష్ట్రంలోని దాహూద్ నివాసి అయిన దిలీప్ దేవాల్ అనే సైకో కిల్లర్ పలు రాష్ట్రాల్లో ఆరు హత్యలు చేశాడు. రత్లాంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో సైకో కిల్లర్ దేవాల్ హతం కాగా, ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు. సైకో కిల్లర్ నవంబరు 25వతేదీన రత్లాంలో దీపావళి వేడుక రోజు ఒకే కుటుంబంలోని ముగ్గురిని కాల్చిచంపాడు.జూన్ నెలలో ఇతను ఓ మహిళను హతమార్చాడు. 


 రత్లాం పట్టణంలో ఓ కుటుంబం ఇటీవల భూమి అమ్మగా వచ్చిన డబ్బు ఇంట్లో ఉంచారని సైకో కిల్లర్ దేవాల్ దోపిడీకి వచ్చి వారిని హతమార్చడని పోలీసులు చెప్పారు. వృద్ధులున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దేవాల్ హతమార్చి దోపిడీలు చేశారని పోలీసులు చెప్పారు.సైకో కిల్లర్ అనుచరులైన అనురాగ్ మెహర్, గౌరవ్ బిల్వాల్, లాలాభాభోర్ లను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

Updated Date - 2020-12-04T11:51:38+05:30 IST