మరో రెండు స్థానాల్లో ఎంఐఎం విజయం..
ABN , First Publish Date - 2020-12-04T18:53:42+05:30 IST
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తొలి ఫలితం ఎంఐఎంకు అనుకూలంగా వెలువడిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తొలి ఫలితం ఎంఐఎంకు అనుకూలంగా వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు చోట్ల కూడా ఎంఐఎం విజయం సాధించింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. కాగా.. డబీర్పురాలో ఎంఐఎం అభ్యర్థి హుస్సేన్ఖాన్ విజయం సాధించగా.. కిషన్బాగ్లో కూడా ఎంఐఎం విజయం సాధించింది. ఎంఐఎం అభ్యర్థి మొబషీరుద్దీన్ విజయం సాధించారు. కాగా.. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి మెట్టుగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాసురి సునీత విజయం సాధించగా.. యూసుఫ్గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్కుమార్ పటేల్ విజయం సాధించారు. ఏఎస్రావునగర్లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషారెడ్డి విజయం సాధించారు.