పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం చేసిన మంత్రి అల్లోల
ABN , First Publish Date - 2020-05-01T23:41:46+05:30 IST
నిర్మల్: దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి భోజనం చేశారు.
నిర్మల్: దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి భోజనం చేశారు. దివ్యా గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన కరోనా నియంత్రణకు కృషి చేస్తోన్న మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్బంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ... లాక్ డౌన్ సమయంలో కరోనా కట్టడికి పారిశుధ్య కార్మికులు రాత్రనక, పగలనక కష్టించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని ప్రశంసించారు. కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, ఎస్పీ శశిధర్ రాజు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్ బాలకృష్ణ, అడిషన్ ఎస్పీ వెంకట్ రెడ్డి, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎఫ్ఎస్సాసీయస్ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.