ప్లిస్కోవా, కెర్బర్ శుభారంభం
ABN , First Publish Date - 2020-09-01T09:50:26+05:30 IST
కరోనా వేళ తొలిసారి గ్రాండ్స్లామ్కు తెరలేచింది. సోమవారం ప్రారంభమైన యూఎస్ ఓపెన్లో మహిళల టాప్సీడ్ కరోలినా ప్లిస్కో వా, 17వ సీడ్ ఏంజెలిక్ కెర్బర్ ..
న్యూయార్క్: కరోనా వేళ తొలిసారి గ్రాండ్స్లామ్కు తెరలేచింది. సోమవారం ప్రారంభమైన యూఎస్ ఓపెన్లో మహిళల టాప్సీడ్ కరోలినా ప్లిస్కో వా, 17వ సీడ్ ఏంజెలిక్ కెర్బర్ శుభారం భం చేశారు. తొలి రౌం డ్లో మాజీ ఫైనలిస్ట్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6-4, 6-0 స్కోరుతో కలినినా (ఉక్రెయిన్)ను చిత్తు చేసింది. జర్మనీకి చెందిన మాజీ చాంపియన్ కెర్బర్ 6-4, 6-4 స్కోరుతో టోమ్జనోవిక్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి రెండోరౌండ్ చేరింది. మరో మ్యాచ్లో వోండ్రొసోవా 6-1, 6-4 స్కోరుతో మినెన్పై నెగ్గింది. పురుషుల సింగిల్స్లో లొండెరొ (అర్జెంటీనా) 6-3, 6-3, 7-5 స్కోరుతో డోన్స్కోయ్ (రష్యా)ను ఓడించాడు.