అసలా రాత్రి ఏం జరిగింది? .. ఆందోళనలో రైనా

ABN , First Publish Date - 2020-09-01T18:53:27+05:30 IST

టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబ సభ్యులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

అసలా రాత్రి ఏం జరిగింది? .. ఆందోళనలో రైనా

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబ సభ్యులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కుటుంబ సభ్యుల్లో ఒకరు కన్నుమూశారు. ఈ విషయాన్ని రైనా సోమవారం ట్విట్టర్‌లో తెలుపుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. పంజాబ్‌లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని.. తన కుటుంబానికి ఏమైందో తెలియడం లేదని వాపోయాడు. తన మామ, అత్త, ఇద్దరు బంధువులపై దాడి జరిగిందని.. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని ట్వీట్ చేశారు. ఆయన గత రాత్రి తుదిశ్వాస విడిచారని చెప్పాడు. తన అత్త ఆరోగ్యం విషమంగా ఉందని  తెలిపాడు. 


అసలా రోజు రాత్రి ఏమైందో ఇప్పటికి తెలియడం లేదని, దాడికి పాల్పడ్డ వారిని గుర్తించాలని పంజాబ్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. ఈ క్రూరమైన చర్యకు పాల్పడ్డ వారిని వెంటనే పట్టుకోవాలని.. వారు మరిన్ని దాడులకు పాల్పడకుండా అడ్డుకోవాలని కోరాడు. 





Updated Date - 2020-09-01T18:53:27+05:30 IST