చంద్రబాబుపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసలు
ABN , First Publish Date - 2020-05-01T23:19:48+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుకు రాజీవ్ కుమార్ లేఖ రాశారు. జీఎస్ఎఫ్టీ తరపున విలువైన సూచనలతో
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుకు రాజీవ్ కుమార్ లేఖ రాశారు. జీఎస్ఎఫ్టీ తరపున విలువైన సూచనలతో నివేదిక అందించారని లేఖలో చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. ఏప్రిల్ 19న ప్రధాని మోదీకి చంద్రబాబు రాసిన లేఖపై రాజీవ్ కుమార్ స్పందించారు. నీతి ఆయోగ్ బృందం మీ రీసెర్చ్ బృందాన్ని త్వరలోనే సంప్రదిస్తుందని చెప్పారు. లాక్డౌన్ సమర్థ నిర్వహణలో కొత్త సంస్థాగత విధానానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబును కొనియాడారు. విశ్లేషణలతో డేటా ఆధారిత విధానాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, కరోనా సంక్రమణ, వ్యాప్తిని గుర్తించడం కోసం సాంకేతిక పరిష్కారాలు ఏర్పాటు చేస్తోందని లేఖలో రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.