రూ.399కే అపరిమిత డేటా

ABN , First Publish Date - 2020-09-01T06:33:32+05:30 IST

ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ జియో.. కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రకటించింది. డేటా వినియోగంపై ఎలాంటి పరిమితులు (అన్‌ లిమిటెడ్‌) లేకుండా జియో ఫైబర్‌ ఇందుకోసం మూడు కొత్త పథకాలు ప్రకటించింది...

రూ.399కే అపరిమిత డేటా

  • రిలయన్స్‌ జియో ఫైబర్‌ కొత్త ప్లాన్‌


న్యూఢిల్లీ : ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ జియో.. కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రకటించింది. డేటా వినియోగంపై ఎలాంటి పరిమితులు (అన్‌ లిమిటెడ్‌) లేకుండా జియో ఫైబర్‌ ఇందుకోసం మూడు కొత్త పథకాలు ప్రకటించింది. సోమవారం నుంచే ఈ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. నెలకు రూ.399 కనీస చందాతో ప్రారంభించిన పథకం అందర్నీ ఆకర్షిస్తోంది. ప్లాన్‌ కింద 30 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో డేటా అప్‌లోడ్‌ లేదా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు రూ.999, రూ.1,499 నెలవారీ సబ్‌స్ర్కిప్షన్‌తో మరో రెండు కొత్త పథకాలు ప్రకటించింది. ఈ రెండు ప్లాన్స్‌లో 11 నుంచి 12 ఓటీటీ యాప్స్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. 


నెల రోజుల ఉచిత ట్రయల్‌: ఖాతాదారులు నెల రోజుల పాటు ఉచితంగా ఈ మూడు ప్లాన్స్‌ ట్రై చేయవచ్చు. నెల రోజులు గడిచిన తర్వాత ఇష్టమైతే సబ్‌స్ర్కైబ్‌ చేసుకోవచ్చు కేవలం ఇంటర్నెట్‌ సేవలు మాత్రమే చాలనుకుంటే రూ.1,500 రిఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించాలి. ఇంటర్నెట్‌తో పాటు ఉచిత ఓటీటీ యాప్స్‌ కావాలంటే రూ.2,500 రిఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించాలి. ఆఫర్‌ కింద కంపెనీ ఉచితంగా 4కే సెట్‌టాప్‌ బాక్స్‌, వైఫై రూటర్‌ను అందిస్తుంది. 

Updated Date - 2020-09-01T06:33:32+05:30 IST