క‌రోనా కోర‌ల్లో ర‌ష్యా.. ఒకేరోజు భారీగా పెరిగిన కేసులు

ABN , First Publish Date - 2020-05-02T00:11:27+05:30 IST

ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌.. అటు ర‌ష్యాలో కూడా కోరలు చాస్తోంది.

క‌రోనా కోర‌ల్లో ర‌ష్యా.. ఒకేరోజు భారీగా పెరిగిన కేసులు

మాస్కో: ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌.. అటు ర‌ష్యాలో కూడా కోరలు చాస్తోంది. శుక్ర‌వారం ఒకేరోజు ర‌ష్యాలో రికార్డుస్థాయిలో దాదాపు 8వేల కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా ఇప్పటివ‌ర‌కు 1,14,431 మంది ఈ వైర‌స్ బారిన ప‌డిన‌ట్టు ఆ దేశ క‌రోనావైర‌స్ క్రిసిస్ రెస్పాన్స్ సెంట‌ర్ తెలిపింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో 96 మంది మ‌ర‌ణించారు. దాంతో మొత్తం మృ‌తుల సంఖ్య 1,169కి చేరింది. కాగా, ర‌ష్యా ప్ర‌ధాని మైఖేల్ మిషుస్తిన్‌(54) సైతం క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. గురువారం నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు పాజిటివ్ అని తేలింది. దీంతో తాను సెల్ఫ్ ఐసోలేష‌న్‌కి వెళ్తున్న‌ట్టు ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌కు మిషుస్తిన్ తెలియ‌జేశారు. కొవిడ్‌-19 సోకిన ఆయ‌న బ‌దులు తాత్కాలిక ప్ర‌ధానిగా ఉప ప్ర‌ధాని అంద్రెయ్ బెలోసోవ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.  

Updated Date - 2020-05-02T00:11:27+05:30 IST