హైదరాబాద్: రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి
ABN , First Publish Date - 2020-10-29T14:51:07+05:30 IST
హైదరాబాద్లోని కూకట్పల్లి దాయారుగూడలో రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది.
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి దాయారుగూడలో రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. బాధితులకు వరద పరిహారం అందించే విషయంలో అన్యాయం చేస్తున్నారని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపిస్తూ నిన్న ధర్నా నిర్వహించారు. అయితే అర్థరాత్రి సమయంలో బీజేపీ నాయకులు, స్థానికులపై గుర్తు తెలియని దుండగులు బీరు సీసాలు, రాళ్లతో దాడి చేశారు. టీఆర్ఎస్ నాయకులే దాడి చేయించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వరద బాధితులకు నష్టపరిహారం అందించే విషయంలో హైదరాబాద్లో పలుచోట్ల వివాదాస్పదంగా మారుతోంది. బాధితులకు పరిహారం ఇవ్వాల్సిందిపోయి.. అధికారపార్టీకి సంబంధించిన కార్యకర్తలకు డబ్బులు పంచుతున్నారంటూ గత కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగా కూకట్పల్లి దాయారుగూడలో రెండు వర్గాల మధ్య నిన్న జరిగిన దాడి సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.