ఢిల్లీలో వైసీపీ ఎంపీ బాలశౌరికి కీలక పదవి
ABN , First Publish Date - 2020-05-02T00:08:26+05:30 IST
ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ ఎంపీ బాలశౌరికి ఢిల్లీలో కీలక పదవి దక్కింది.
న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ ఎంపీ బాలశౌరికి ఢిల్లీలో కీలక పదవి దక్కింది. ‘పబ్లిక్ అకౌంట్ కమిటీ’ సభ్యుడిగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి 2020-21 ఆర్ధిక సంవత్సరానికిగాను ఎన్నికయ్యారు. వైసీపీ ఎంపీని నియమించినట్లు పబ్లిక్ అకౌంట్ కమిటీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. లోకసభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరిని పీఏసీ ఛైర్పర్సన్గా స్పీకర్ ఓం బిర్లా నియమించారు.