ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: మంత్రి సీదిరి

ABN , First Publish Date - 2022-11-30T03:19:33+05:30 IST

పలాస, నవంబరు 29: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని..

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: మంత్రి సీదిరి

పలాస, నవంబరు 29: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని.. ఇందుకోసం కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాల’ని రాష్ట్ర మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో జీఎంఈ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన ప్రగతిభవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే తాము ఎన్నికల ప్రచారంలో ఉన్నామని స్పష్టం చేశారు. కొంతమంది పనిగట్టుకొని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కార్యకర్తల అండ ఉన్నంతవరకు తన వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌, నారా లోకే్‌షలు ముఖ్యమంత్రి జగన్‌తో పోటీ పడగలరా? అని ప్రశ్నించారు.

Updated Date - 2022-11-30T03:19:34+05:30 IST