Home » LATEST NEWS
కరువు సహాయక పనుల కోసం కర్ణాటకకు రూ.3,454 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్షా సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ కరువు ఉపశమనం (ఖరీప్ 2023) కింద నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్ (AIIMS)కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థిని మెడికల్ బోర్డు శనివారంనాడు పరిశీలించింది.
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు మొదట్నించీ పట్టు ఉన్న అమేథి , రాయబరేలి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎవరిని తమ అభ్యర్థులుగా బరిలోకి దింపనుందనే సస్పెన్స్కు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. అమేథీ, రాయబరేలికి చెందిన పార్టీ విభాగం నేతలతో కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమవుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది.
అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వరిస్తుందో ఎవ్వరూ పసిగట్టలేరు. కొందరు రేయింబవళ్లు కష్టపడినా దొరకని అదృష్టం.. మరికొందరిని ఏం చేయకపోయినా వరిస్తుంది. స్వయంగా అదే వెతుక్కొని వచ్చి మరీ తలుపు తడుతుంది. ఇప్పుడు ఓ మహిళ విషయంలో కూడా అదే జరిగింది.
యాపిల్ పండు నైలపై పడడం చూసిన న్యూటన్.. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని తేల్చారు. ఆ తర్వాత ఆయన దీనిపై అనేక పరిశోధనలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ కాలువ వీడియో చూసి..
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోపై మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. పేద వాడి జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని అన్నారు.
మాట తప్పను.. మడమ తిప్పనంటారు.. కానీ చేసేదంతా రివర్స్ ఉంటుంది. అనునిత్యం మాట తప్పడం.. మడమ తిప్పడమే పనిగా ఉంటారు. మేనిఫెస్టో(YSRCP Manifesto) అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని ఊదరగొడతారు.. కానీ, అదే మేనిఫెస్టోలోని హామీలను 85 శాతం అమలు చేయకుండా పవిత్ర గ్రంధాలకు అపచారం చేస్తారు.
వైసీపీ మేనిఫెస్టో చూసి క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలో కొత్త స్కీం లేదు, మెరుపులు లేవని పెదవి విరుస్తున్నారు. మేనిఫెస్టోలో ఉన్న హామీలతో కూటమిని ఎలా ఎదుర్కొంటామని ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీ కన్నా కూటమి మేనిఫెస్టో వెయ్యి పాళ్లు నయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27న 24 వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఇన్నాళ్లు ఫేస్ బుక్కే పరిమితమైన కేసీఆర్ ఇవాళ సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాంలైన ఎక్స్, ఇన్ స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపై సోషల్ మీడియాని ఫుల్గా వాడేసుకోవడానికి రెడీ అయిపోయారన్నమాట.
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయం సమీపిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక పార్టీలు ప్రజలను ఆకర్షించేలా మేనిఫెస్టోలను విడుదలచేస్తున్నాయి. ఎన్నికల ప్రకటనకు ముందే సూపర్ సిక్స్ పథకాలతో టీడీపీ ప్రజల్లోకి వెళ్లగా.. తాజాగా వైసీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. టీడీపీ సైతం పూర్తిస్థాయి మేనిఫెస్టోను రెండు, మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.