ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో మాకు సంబంధం లేదు

ABN , First Publish Date - 2022-12-02T04:37:24+05:30 IST

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 1: ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. అరెస్టయిన అమిత్‌ అరోరా

ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో మాకు సంబంధం లేదు

అమిత్‌ అరోరా ఎవరో తెలియదు: వైసీపీ ఎంపీ మాగుంట

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 1: ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. అరెస్టయిన అమిత్‌ అరోరా ఎవరో తనకు తెలియదని.. ఇంతవరకు ఆయనతో తాను మాట్లాడింది కూడా లేదని చెప్పారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఇది ఉత్తర భారతం వాళ్లు దక్షిణ భారతం వాళ్లపై చేసిన వ్యాపార కుట్రగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కుట్రలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. ‘మేం దక్షిణ భారతంలోనే గత 70 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నాం. ఇంతవరకు మాగుంట కుటుంబంపై ఎలాంటి ఆరోపణలు లేవు. త్వరలోనే అన్ని నిజాలూ అందరికీ తెలుస్తాయి’ అని ఎంపీ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-02T04:37:25+05:30 IST