Pensions: ఆసరా పెన్షన్లలో దొంగనోట్ల కలకలం

ABN , First Publish Date - 2023-01-01T12:32:25+05:30 IST

నర్సాయపాలెంలో ఆసరా పెన్షన్లలో దొంగనోట్ల కలకలం రేపాయి. పెన్షన్లలో 38 నకిలీ రూ.500 నోట్లను లబ్ధిదారులు గుర్తించారు.

Pensions: ఆసరా పెన్షన్లలో దొంగనోట్ల కలకలం

ప్రకాశం: నర్సాయపాలెంలో ఆసరా పెన్షన్లలో దొంగనోట్ల కలకలం రేపాయి. పెన్షన్లలో 38 నకిలీ రూ.500 నోట్లను లబ్ధిదారులు గుర్తించారు. దీంతో వాలంటీర్‌ (Volunteer)కు పెన్షన్‌ లబ్ధిదారులు తిరిగి డబ్బులు ఇచ్చేశారు. పెన్షన్‌లో దొంగనోట్లు రావడంతో లబ్ధిదారుల ఆందోళన చెందారు. దొంగనోట్ల ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. గ్రామ కార్యదర్శి యర్రగొండపాలెం (Yerragondapalem) బ్యాంక్‌లో డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు.

Updated Date - 2023-01-01T12:32:26+05:30 IST