MS Dhoni: వీరాభిమానిని కలిసిన ధోనీ.. మురిసిపోయిన ఖుష్బూ.. ఆమె ట్వీట్ వైరల్!

ABN , First Publish Date - 2023-04-16T10:34:42+05:30 IST

మహేంద్ర సింగ్ ధోనీకి దేశవిదేశాల్లో అభిమానులు ఉన్నారు. వయసుతో తేడా లేకుండా అందరూ ధోనీ‌లోని గొప్ప లక్షణాలను ఇష్టపడుతుంటారు.

MS Dhoni: వీరాభిమానిని కలిసిన ధోనీ.. మురిసిపోయిన ఖుష్బూ.. ఆమె ట్వీట్ వైరల్!

మహేంద్ర సింగ్ ధోనీకి (MS Dhoni) దేశవిదేశాల్లో అభిమానులు ఉన్నారు. వయసుతో తేడా లేకుండా అందరూ ధోనీ‌లోని గొప్ప లక్షణాలను ఇష్టపడుతుంటారు. ఎంత విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండడం, అద్భుతంగా ఆలోచించడం, టీమిండియాకు లెక్కలేనని మరపురాని విజయాలను అందించడం ధోనీని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు (CSK) ఆడుతుండడం వల్ల తమిళులు ధోనీని తమ స్వంతవాడిగా భావిస్తారు.

ధోనీని విపరీతంగా అభిమానిస్తారు. ధోనీ అభిమానుల జాబితాలో తమిళ నటి ఖుష్బూ సుందర్ (KhushbuSundar) అత్తగారు కూడా ఉన్నారు. ధోనీని ఒక్కసారైనా కలవాలనేది ఆమె కోరికట. తాజాగా తన సీనియర్ వీరాభిమాని ఆశను ధోనీ నెరవేర్చాడు. ఆమెను కలిశాడు ( Dhoni Meets Khushbu Sundar's Mother-in-Law). దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన అభిమాన క్రికెటర్‌ను ఆవిడ దగ్గరకు తీసుకుని ముద్దాడింది. ఆమెతో కొద్ది సమయం ధోనీ ఆత్మీయంగా గడిపాడు. ఈ విషయాన్ని ఖుష్బూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

PBKSvsLSG: కేఎల్ రాహుల్ పట్టిన ఈ క్యాచ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో!

``హీరోలను ఎవరూ తయారు చేయలేరు. వారు పుట్టుకతోనే అలా ఉంటారు. ధోనీ ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు. మా చెన్నై కెప్టెన్, ``తల`` పంచిన ఆత్మీయతను, ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అతను మా 88 ఏళ్ల అత్తగారిని కలిశాడు. ఆమె ధోనీకి వీరాభిమాని. మహీ.. నిన్ను చూసిన ఆనందంలో ఆమె మరిన్ని ఎక్కువ సంవ్సతరాలు సంతోషంగా, ఆరోగ్యంగా జీవిస్తుంద``ని ఖుష్బూ ట్వీట్ చేసింది.

Updated Date - 2023-04-16T10:34:42+05:30 IST